వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం . సహాజంగా ఎక్కడైన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి.. వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ..ఎంపీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని స్థానిక గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.
కానీ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవీంద్రకు తన సొంత ఊరి ప్రజలే షాకిచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆయనతో ఎవరు కూడా నేరుగా మాట్లాడొద్దు అని ఆ గ్రామాస్తులు తీర్మానం చేశారు. ఒకవేళ ఎవరైన నేరుగా మాట్లాడితే రూ.10వేలు జరిమానా విధించనున్నారు.
ఇంకా ఫోన్లో మాట్లాడితే రూ.3వేలు జరిమానా చెల్లించాల్సిందే అని ఊరి ప్రజలు కట్టుబాటు పెట్టుకున్నారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వివాదం చెలరేగుతుంది.