మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల ఆధారంగా యువత బీజేపీకి దూరమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా గల్లీల్లోనూ దేశ రాజకీయాలను ప్రస్తావించడం..
స్థానిక సమస్యలపై స్పందించకపోవడం ..ప్రజల సమస్యలపై కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం తీసుకొంటున్న పరిష్కార మార్గాలను వివరించకపోవడం వలన ఆ పార్టీకి ప్రజలు ,యువత దూరమయ్యారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సీఏఏ,ఎన్ఆర్సీ వల్ల దాదాపు ఇరవై శాతం మంది యువత బీజేపీకి ఓట్లు వేయలేదని సర్వేలు చెబుతున్నాయి. గోలీమార్ నినాదం కూడా ఒక వర్గాన్ని బీజేపీకి దూరం చేసినట్లు వారు చెబుతున్నారు.