తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్రంలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. జీఎస్టీ వసూలులో తెలంగాణ రాష్ట్రం ముందు ఉందని పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా కితాబు ఇచ్చారు.
బుధవారం అజయ్ హైదరాబాద్ మహానగరంలోని బీఆర్కే భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ అజయ్ కు తెలంగాణలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ పటిష్ఠంగా ఉతెలంగాణలో జీఎస్టీ రాబడి ఇతర రాష్ర్టాల కంటే పెరుగడానికి గల కారణాల గురించి వివరించారు.
రాష్ట్రంలో వాణిజ్యపన్నుల సర్కిళ్లను హేతుబద్ధంచేసి అధికారులందరికీ సమానంగా బాధ్యతలు అప్పగించామని సీఎస్ తెలిపారు. సర్కిళ్ల పరిధిలో ఉన్న అంతరాలను తగ్గించి పరిపాలనకు అనుకూలంగా మార్చామని, అవసరమైనచోట కొత్త డివిజన్లు, సర్కిళ్లను ఏర్పాటుచేశామని ఆయన వివరించారు.