రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూల్ జిల్లా వెల్దుర్తి లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ..మూడు రాజధానులు వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చంద్రబాబు చేసిన తప్పును వైసీపీ పార్టీ చేయబోనని వెల్దుర్తినిరాహార దీక్షలో తెలియజేశారు. వైసీపీ నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రవి రెడ్డి , మాజీ జెడ్పిటిసి సమీర్ కుమార్ రెడ్డి , అగస్టీన్ , పెద్ది రెడ్డి , వెంకటనాయుడు , ఆరీఫ్ మరియు వెల్దుర్తి మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .