Home / ANDHRAPRADESH / టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!

టీడీపీ పరువు అడ్డంగా తీసేసిన బీజేపీ ఎమ్మెల్సీ…!

ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్‌ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్‌ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా చేయాలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలిసినంతగా భారతదేశంలో ఎవరికీ తెలీదని, చంద్రబాబు అవినీతిని తవ్వడానికి గునపాలు చాలవు బుల్‌డోజర్లు కావాలని సెటైర్లు వేశారు. అయినా తప్పు చేసి తప్పించుకోవడంలో బాబును మించిన మేధావి లేరని మండిపడ్డారు.

 

చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్, లోకేష్ స్నేహితులు, కొంత మంది మాజీ మంత్రుల పుత్రరత్నాల ద్వారా 2 వేల కోట్ల రూపాయల ఒక చిన్న కుంభకోణం బయటపడింది.దీన్ని బాగా స్టడీ చేస్తే ఇది ఎన్ని వేల కోట్లకు వెళుతుందనే అంచనా ఊహలకందదని విమర్శించారు. అసలు పర్సనల్ సెక్రటరీకి, సీఎంతో సంబంధం లేకుండా ఆయన దగ్గర రూ.2వేల కోట్లు ఎలా వచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. పీఎస్‌ శ్రీనివాస్‌ సత్యహరిశ్చంద్రుడైతే చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ల సహాయం లేకుండా ఇన్ని లాకర్లకు సీల్‌ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. చంద్రబాబు హయాంలోనే నీరు– చెట్టు పనులపై రూ.25 వేల కోట్ల అవినీతి జరిగిందని సోమువీర్రాజు ఆరోపించారు. అలాగే బాబు సీఎంగా ఉండగా , రూ.4500 కోట్ల విలువైన పోలవరం పనులను రూ.5350 కోట్లకు అంచనాలు పెంచారని…మరి ఆ ఎస్టిమేషన్లను పెంచగా వచ్చిన ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందని నిలదీశారు. స్వచ్ఛభారత్, గృహనిర్మాణశాఖలలో జరిగిన అవినీతిపై ఇప్పుడు విజిలెన్స్‌ ఎంక్వయిరీ జరుగుతోందని సోమువీర్రాజు తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా స్టడీ చేస్తున్నాయని చెప్పారు.

 

ఈ సందర్భంగా లోకేష్‌పై కూడా సోమువీర్రాజు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టడానికి ప్రధాన కారణం లోకేశే… మంగళగిరి పలకలేనటువంటి తింగరి మంగళం కాదు లోకేశ్‌ బాబు అని సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. ఐటీ దాడులు అనేవి చంద్రబాబు లాంటి ..ఒక అవినీతిపరుడికి.. భారత ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ…ఈ విషయాన్ని పక్కదారి పట్టించాలనే లోకేష్ తెలివిగా వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. మొత్తంగా ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడుతున్న కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ‌్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat