తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు.
దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే అతడ్ని బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.పెళ్ళి అయిన కొద్ది గంటలకే వరుడు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.