ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ శుక్రవారం నాడు జట్టు కొత్త లోగోని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఒకప్పటి ఓనర్ విజయ్ మాల్య ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో ఇప్పుడు 13 ఎడిషన్ లో అడుగుపెట్టాం వారిని ఇప్పుడు సింహాల్లా వదిలితేనే టైటిల్ తెచ్చిపెడతారు అని అన్నారు. నిజానికి అతను కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ అతడికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశపడుతున్న టైటిల్ వెంటనే మనకి వస్తుంది అని ట్వీట్ చేసాడు.