తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి -ఆర్నికొండ రోడ్డు మార్గంలో జరిగిన ఒక ప్రమాదంలో భూమయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించాడు.
అంతే కారును ఆపించి మరి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు. తన కాన్వాయ్లోని ఒక కారులోకి భూమయ్యను ఎక్కించి.. ఆసుపత్రిలో చేర్పించాడు. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి అధైర్యపడోద్దు.. అన్ని విధాలుగా ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. మంత్రి స్పందనపై స్థానికులు హార్షం వ్యక్తం చేస్తోన్నారు.