తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలో అల్గునూరు వద్ద జాతీయ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కిందపడింది.
కొమురవెల్లి మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడక్కడే దుర్మరణం చెందాడు.
అయితే ఈ ప్రమాదాన్ని వంతెనపై నుంచి పరిశీలిస్తున్న కానిస్టేబుల్ కాలు జారి కింద పడ్డాడు. దీంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.