తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది.
ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా చర్చించనున్నారు.
మరోవైపు అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టుల నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం.