Home / ANDHRAPRADESH / జగన్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. దేశమంతా అభినందిస్తోంది !

జగన్ ని ఫాలో అవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. దేశమంతా అభినందిస్తోంది !

మహిళలకు భద్రత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఫాలో కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని మహరాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకువది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరి 20 న వారు ఇక్కడికి వస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు రావడం పట్ల దేశమంతా ఆయనను అభినందిస్తోంది.

ఈ చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించవచ్చు. ఈ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినా ఇంకా పూర్తిస్థాయిలో చట్టం కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే దిశ చట్టం అధికారికంగా అమలులోకి వస్తుంది. అయినప్పటికీ ఈ చట్టంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat