తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.