ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. టన్నెల్–2 వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శి్చారు. తర్వాత టన్నెల్ లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్–1ను పరిశీలించి వెలుగొండ ప్రాజెక్టుల పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం పనులను వేగంగా పూర్తిచేయాలన్న సీఎంమొదటి టన్నెల్ పనులు నెలకు 200 మీటర్ల చొప్పున తవ్వుకుంటూ జూన్–జులై నాటికి అందిస్తామన్న కాంట్రాక్టు సంస్థహెడ్ రెగ్యులేటర్. అదికూడా మూడు–నాలుగు నెలల్లో చేస్తామని వెల్లడించిన కాంట్రాక్టు సంస్థహెడ్ రెగ్యులేటర్తోపాటు అటు వైపునుంచి మొదటి టన్నెల్ పనులుకూడా పూర్తిచేస్తామన్న నిర్మాణ సంస్థ. అలాగే టన్నెల్ –2ను అత్యంత వేగంగా పూర్తిచేయాలన్న సీఎం కోరారు. రెండువైపుల నుంచి తవ్వకాలు చేసేదిశగా ఆలోచన చేయాలని,
గత ఐదేళ్లుగా వెలుగొండ పనులు ఎందుకు ముందుకుసాగలేదని ప్రశ్నించారు. మార్చి 31లోగా మొదటి ఫేజ్కు సంబంధించి భూ సేకరణ పనులు పూర్తిచేస్తామని అధికారులు. సీఎం జగన్ కు తెలిపారు. తరువాత ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన పనులపై ఆరా తీసిన సీఎం గడచిన రెండేళ్లకాలంలో పనులు నిలిచిపోయాయంటూ వెల్లడించిన అధికారులుఐదేళ్లకాలంలో రెండో సొరంగంలో తవ్వింది కేవలం 410 మీటర్లేనని వెల్లడివెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులుకూడా ముందుకు సాగలేదన్న అధికారులు.దీంతో వేరే సంస్థకు పనులు అప్పగించామని తెలిపారు. కాగా సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, రివర్స్ టెండరింగ్కు వెళ్లి వేరే సంస్థకు అప్పగించాలన్న సీఎం కోరారు.
వెలుగొండ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఒక్కో నిర్వాసితుల కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం తెలిపారు.సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్కుమార్, బాలినేని, విశ్వరూప్ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి,ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, వేణుగోపాల్, మహీధర్రెడ్డి,
నాగార్జున, అన్నా రాంబాబు తదితరులు.