ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అయితే దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అదే అహ్మదాబాద్ లోని మొతెరా క్రికెట్ స్టేడియం.ఇందులో అన్ని రకాల క్రీడాలు ఆడవొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న ఈ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించనున్నాడు. ఆయన స్టేడియం నుండి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే మార్గం లో 1.5 కిలోమీటర్లు మేర ఎక్కడికక్కడ రోడ్డులు వేయిస్తుంది గుజరాత్ ప్రభుత్వం. అంతేకాకుండా ఆ రోడ్డు మార్గంలో ఉండే బస్తి వాళ్లకు చక్కగా డ్రైన్స్ మరియు గోడలు వాటికి పెయింటింగ్ వేయించారు. ట్రంప్ అహ్మదాబాద్ లో ఉండేది 3గంటలే అయినప్పటికీ ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 100కోట్లతో పనులు చేపట్టారు.
A wall is being built in #Ahmedabad to hide the slums along Trump's way to Motera stadium. The city administration is also painting walls for decoration. How do people living in the slum feel about all this, Watch @mausamii2u's #ReporterDiary
More Videos:https://t.co/FAHzdk9TO8 pic.twitter.com/UmaCZtsta5— India Today (@IndiaToday) February 20, 2020