ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్లాక్ క్యాప్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కి వచ్చిన ఓపెనర్స్ కాసేపు పర్వాలేదు అనుపించిన న్యూజిలాండ్ బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయారు. ప్రిథ్వి షా, మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లి, పుజారా, హనుమ విహారి అందరు చేతులెత్తేశారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ రహానే, పంత్ ఆడుతున్నారు. రహానే జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్కోర్ 122/5.