తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబ్నగర్ పట్టణంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని వృద్దులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. అంతా మంచిగున్నరా…పింఛన్లు వస్తున్నయా,..నీళ్లు వస్తున్నయా…డ్రైనేజీ సక్కగా తీస్తున్నరా..లైట్లు ఉన్నయా..మీకు ఎంత మంది పిల్లలు..వాళ్లేం చేస్తున్నారంటూ కేటీఆర్ ఓ అవ్వను అడిగి తెలుసుకున్నారు..స్థానికంగా ఉన్న సమస్యలపై కేటీఆర్ ఆరా తీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అంతా మంచిగుందని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మితో పాటు ఇతర పథకాలు అందుకుంటున్నామని వృద్ధులు.. కేటీఆర్కు చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ను, ప్రభుత్వాసుపత్రి సమీపంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ను, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించిన బీటీ రోడ్డు మరియు సెంట్రల్ మీడియన్, రైల్వేస్టేషన్ నుంచి డీఈవో ఆఫీసు వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ కలిసి ప్రారంభించారు. మొత్తంగా పాలమూరులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాంగా కేటీఆర్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.
Home / TELANGANA / మహబూబ్నగర్లో పట్టణ ప్రగతికి శ్రీకారం.. మంత్రి కేటీఆర్ పాదయాత్రకు అపూర్వ స్పందన..!
Tags huge response MINISTER KTR padayatra Palamuru pattana pragati Telanghana