బంగ్లాదేశ్ వ్యవస్థాపక ఫాదర్ మరియు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ పుట్టిన శతాబ్ది సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఆసియా XI మరియు ప్రపంచ XI ల మధ్య రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఎంతో వైభవంగా చెయ్యాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లు ఢాకాలోని షేర్ ఇ బంగ్లా స్టేడియం లో మార్చ్ 18 మరియు 21న జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ లకు సంబంధించి 6గురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. వారు ఇండియన్ కెప్టెన్ కోహ్లి, ధవన్, రాహుల్, పంత్, షమీ, కుల్దీప్ యాదవ్. ఇక వరల్డ్ Xl జట్టుకు డుప్లేసిస్ సారధిగా వ్యవహరించనున్నాడు. వరల్డ్ Xl జట్టు వివరాల్లోకి వెళ్తే..!
అలెక్స్ హేల్స్, క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), నికోలస్ పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్స్టో, కీరోన్ పొలార్డ్, ఆదిల్ రషీద్, షెల్డన్ కాట్రెల్, లుంగీ ఎన్గిడి, ఆండ్రూ టై, మిచెల్ మెక్క్లెనాగన్