న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిరాశజనక ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో 348 పరుగులు చేసిన కివీస్.. కీలకమైన 183 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇక రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటింగ్ లైనప్ గాడిన పడలేదు.మూడోరోజు ఆటముగిసేసరికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్యర్థి కంటే 39 పరుగుల వెనుకంజలో ఉంది. టాపార్డర్లో మయాంక్ అగర్వాల్ (58) రాణించాడు. ఓపెనర్ పృథ్వీ షా (14), చటేశ్వర్ పుజారా (11) కెప్టెన్ విరాట్కోహ్లీ (19) విఫలమయ్యారు.
ముఖ్యంగా ఓపెనర్గా శుభారంభాలు అందించాల్సిన షా.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ తేలిపోయాడు. ఈక్రమంలో షాను తప్పించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అతని స్థానంలో రెండోటెస్టులో శుబ్మాన్ గిల్ను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.