Home / SLIDER / వెలుగులోకి వచ్చిన రేవంత్‌ భూదందా

వెలుగులోకి వచ్చిన రేవంత్‌ భూదందా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి భూదందా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని భూమి.. ఎకరం ధర దాదాపు రూ.పాతికకోట్లు. మొత్తం ఏడెకరాల భూమి విలువ రూ.150 కోట్లపైమాటే.

ఇంతవిలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని అసరా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుముల రేవంత్‌రెడ్డి భూదందాకు పాల్పడ్డారు. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, తన సోదరుడి పేరుమీద మ్యుటేషన్‌ చేయించుకున్నారు.

శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో ఏడెకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమమార్గంలో దక్కించుకున్నట్టు రంగారెడ్డి జిల్లా అధికారులు తమ విచారణలో తేల్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదికను అందజేశారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉన్నతాధికారులు.. నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్‌ చేసిన తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.

గోపనపల్లిలోని సర్వేనంబరు 127లో 10.21 ఎకరాల భూమి ఉన్నది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి క్రయవిక్రయాలు జరిగినట్టు కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వేనంబర్‌ 127లోని భూమిలో తమకు హక్కుఉన్నదని, రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కొల్లా అరుణ 2017లో హైకోర్టులో 17542,17637 నంబర్లతో రిట్‌పిటిషన్‌ వేశారు. అలాగే అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని అనిల్‌కుమార్‌ అనేవ్యక్తి 2015లో రంగారెడ్డి జిల్లా సివిల్‌ కోర్టులో 780/2015 నంబర్‌తో పిటిషన్‌ దాఖలుచేశారు. వీటిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందుగా ఈ భూమిని వేరేవారి పేరుమీద రాయించి.

తర్వాత వారినుంచి రేవంత్‌రెడ్డి, అతడి సోదరుడు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 6 ఎకరాల 39.5 గుంటలను ఎంపీ రేవంత్‌రెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డి తమపేరు మీద రాయించుకున్నట్టు తేల్చారు. 2.20 ఎకరాలను కళావతి నుంచి అనుముల కొండల్‌రెడ్డి పేరుమీద.. అలీసలీమ్‌ బిన్‌, హబీబ్‌ అబ్దుల్హ్రీమ్‌, ఈ లక్ష్మయ్య, ఏ వెంకట్రావు నుంచి 1 ఎకరం 29.5 గుంటలు,13.5 గుంటలు, అలీసలీమ్‌ బిన్‌, హబీబ్‌ అబ్దుల్‌ రహీమ్‌, ఏ వెంకట్రావు అండ్‌ అదర్స్‌ నుంచి 1.24 ఎకరాలు, ఈ లక్ష్మయ్య నుంచి 31.5 గుంటలను అనుముల రేవంత్‌రెడ్డి పేరుమీద రెవెన్యూ అధికారులు వివిధ మ్యుటేషన్ల ద్వారా బదిలీచేసి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు విచారణలో తేలింది.

నకిలీ డాక్యుమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 127 సర్వేనంబర్‌లోని భూమికి నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేయడంతోపాటు, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన నాటి శేరిలింగంపల్లి తాసిల్దార్‌ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్‌.. రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక పంపించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌/తాసిల్దార్‌ డీ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat