దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకోచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన రాష్ట్రపతి భవన్లోని విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా బుధవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంటికి వెళ్లి మరి ముఖ్యమంత్రి కలిశారు.
ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు చెందిన పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులపై ముఖ్యమంత్రి చర్చించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు బీబీపాటిల్,నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్ రెడ్డి,మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.