ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను,ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)రాబడిలో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పన్ను వసూళ్లలో భారీ లక్ష్య సాధనవైపు వడివడిగా అడుగులేస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక స్పెషల్ డ్రైవ్స్ ,ప్రత్యేక యాప్ లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తుంది.
దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు తగ్గిన కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం టాప్ ప్లేస్ లో ఉంది. గత ఏడాదికంటే వృద్ధి రేటు తగ్గిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యల వలన లక్ష్యాన్ని మించి ఖజానాకు రాబడి చేకూరుతున్నది. వాస్తవానికి ప్రస్తుతం దక్షిణాదిలో జీఎస్టీ రాబడిలో తెలంగాణ రాష్ట్రమే అగ్రగ్రామిగా ఉంది.
2019-20 వార్షిక బడ్జెట్లో వాణిజ్య పన్నులు,జీఎస్టీ ద్వారా రూ.47వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి ఆ అంచనాలను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వాస్తవానికి బడ్జెట్ అంచనాల్లో ఎనబై నుండి తొంబై శాతం సాధిస్తే దాన్ని గొప్ప విజయమంటారు. కానీ ఈసారి ఇప్పటికే రూ.40,268కోట్లు వసూలయ్యాయి. ఇది మొత్తం లక్ష్యంలో ఎనబై ఎనిమిది శాతం ఉండటం గమనార్హం