మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు.ఇంటికి వెళ్లి తంతామని లోకేష్ మాట్లాడుతున్నాడు. ఎవరి ఇంటికి వెళ్లి తంతాడో లోకేష్ను రమ్మనండి. ప్రజలు వారి అసంతృప్తిని, అసహనాన్ని రకరకాలుగా వ్యక్త పరుస్తుంటారు. దానిపై సమన్వయంతో వ్యవహరించాలి కానీ ప్రాంతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లోకేష్ వ్యవహార శైలి ఉంది అని మండిపడ్డారు.