టాలీవుడ్ మాస్ మహారాజు.. స్టార్ హీరో రవితేజ బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీలతో…. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు చిత్రాల్లో చాలా మూవీలు నిరాశపరిచాయి.
దీంతో ప్రస్తుతం మాస్ మహారాజు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో రవితేజ తన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు.
అయితే దీని తర్వాత రవితేజ కామెడీ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించనున్నట్టు తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.