Home / ANDHRAPRADESH / టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!

టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రూ. 34 కోట్లతో ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి, బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు చేసారు.

అలాగే చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు, హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. సోషియల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు…కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat