ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మృత్యువాత పడినట్లు వార్తలు వస్తోన్నాయి. మొత్తం ఎనబై వేల మంది ఈ వైరస్ భారీన పడితే నలబై ఏడు వేల మంది చికిత్సతో బయట పడ్డారు. మిగతావాళ్లకు చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో ఈ వైరస్ కు అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టారు.ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నివారణకు వ్యాక్సిన్ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా ప్రకటించింది.అయితే దీనిని ప్రస్తుతం మనుషులపై ప్రయోగించడానికి సిద్ధం చేశామని ఆ సంస్థ ప్రకటించింది.
ప్రయోగాల కోసం ఈ వ్యాక్సిన్ను అమెరికా ప్రభుత్వ పరిశోధకులకు పంపామని, ట్రయల్స్ ఏప్రిల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్ తొలి బ్యాచ్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్కు పంపినట్లు మోడెర్నా తెలిపింది.