తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు.
అంతేకానీ మైండ్ స్పేస్ లో అన్ని కంపెనీలు మూతపడలేదు.. తమ ఉద్యోగులను పంపించలేదు అని చెప్పారు. గురువారం నుండి మైండ్ స్పేస్ లోని అన్ని కంపెనీలు యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు.