Home / AIKATHA SILPA / సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !

సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వైయిఎస్(YES) బ్యాంకును అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆయన అన్నారు. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని ఉన్నాయో? అని ఎద్దేవా చేసారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లూటీలు చేసాడో ఒక్కొకటిగా అన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు. మరోపక్క ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బాబు ప్రస్తుతం స్థానిక ఎన్నికల విషయంలో రచ్చ చేసి ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నాడు కాని ఆయన పప్పులు ఉడకవని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat