తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది.
రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
అంతకుముందు ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీఏసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.