Home / ANDHRAPRADESH / బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఇరుక్కున్న గంటా..ఆస్తుల వేలం..!

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఇరుక్కున్న గంటా..ఆస్తుల వేలం..!

టీడీపీ నేతలు వరుసగా బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో కూరుకుపోగా..ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 837 కోట్ల రుణాల ఎగవేసిన రాయపాటి సాంబశివరావు, 13 కోట్లు ఎగవేసిన బాలయ్య అల్లుడు భరత్ తదితర నేతల ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంకు ప్రకటించింది.

 

తాజాగా బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంక్ ఈవేలం పద్దతిలో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని గంటాకు చెందిన ప్లాట్‌ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా, గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.141.68 కోట్ల లోన్ తీసుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.220.66 కోట్లకు రుణం చేరింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటాతో పాటు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఇండియన్‌ బ్యాంక్‌ వేలానికి సిద్ధం చేసింది. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం విశాఖ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat