జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా..ఇంకా తన పార్టనర్ చంద్రబాబుపై ప్రేమ తగ్గలేదు. గత ఆరేళ్లుగా చంద్రబాబుకు రహస్యమిత్రుడిగా ఉన్న పవన్ ఇటీవల కాషాయగూటిలో చేరారు. కమలనాథులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. మార్చి 12 న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే జనసైనికులు టీడీపీ నేతలతో పొత్తులు పెట్టుకుంటున్నారు
. బీజేపీతో పొత్తు ఏమో కాని..పలు చోట్ల జనసేన, టీడీపీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పవన్ పార్టీకి అంత సీన్ లేదు కాని…కాపులు ఎక్కువగా ఉణ్న గోదావరి జిల్లాల్లో కొద్దొగొప్పో ప్రభావం చూపగలరు. దీంతో జనసేన పార్టీ తరపున నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. కాని అవి కాస్తా టీడీపీ నేతల కనుసన్నలలోనే జరుగుతున్నాయటా…ఎక్కడెక్కడ తాము గెలుస్తామో చూసుకుని, అక్కడ జనసేనను బరిలో ఉంచాలా లేదా అనే విషయాన్ని టీడీపీ నేతలే డిసైడ్ చేస్తున్నారంట..ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ నేతల ఆదేశాలనుసారమే జనసేన నామినేషన్లు దాఖలు అవుతున్నాయంట.
ఇంకో కామెడీ ఏంటంటే పెద్దాపురంలో టీడీపీ , జనసేనలు డైరెక్ట్గా కలిసిపని చేస్తున్నాయి. వార్డులు కూడా పంచుకుని మరీ పోటీ చేస్తున్నాయంట…అంతే కాదు మున్సిపల్ ఛైర్మన్ పదవిని కూడా చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని డిసైడ్ అయ్యారంట…మాజీ హోంమంత్రి చినరాజప్పగారే టీడీపీ, జనసేన ల మధ్య పొత్తు కుదర్చారంట…ఒక్క ప.గో. జిల్లాలోనే కాదు..రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ. జనసేన అభ్యర్థులు అవగాహనతో పోటీ చేస్తున్నారంట.. ఒక పక్క బీజేపీతో పోత్తు పెట్టుకుని, మరో పక్క టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీని చూసి రాజకీయ విశ్లేషకులే అవాక్కవుతున్నారు. మొత్తంగా బీజేపీతో పెళ్లి…టీడీపీతో కాపురం..మీరు సూపర్ పవన్జీ…అంటూ నెట్జన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.