దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి దగ్గ తనయుడిగా నిలిచాడు. ఇక ఈ సందర్భంగా జగన్ బుధవారం ట్వీట్ చేసారు.. ”మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీఅందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని ట్వీట్ చేసారు.
మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన @YSRCParty రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీఅందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 11, 2020