టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఎందుకు ఆశిస్తున్నారని రేవంత్ను ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న చర్చను సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. రేవంత్రెడ్డి అనుచరులు ఫేస్బుక్లో చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు.
రేవంత్ అనుచరులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. వారి అరాచకాలను అడ్డుకోవాలని టీపీసీసీని కోరారు.కాంగ్రెస్ పార్టీ అందరిదని.. అలాంటి పార్టీని రేవంత్ అనుచరులు బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరనేది సోనియా గాంధీ చెబుతారని అన్నారు. రేవంత్కు అంత దమ్ము ఉంటే.. టీడీపీలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయలేదని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్కు కార్యకర్తల బలం ఎక్కువగా ఉందనే రేవంత్ తమ పార్టీలో చేరారని విమర్శించారు. రేవంత్ అనుచరులు న్యూసెన్స్ ఆపకపోతే ..ఆయన తన షోయింగ్ తగ్గించుకోకపోతే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.