ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.