తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలతో పాటు ముస్లీం వర్గానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా ముస్లీంల కోసం షాదీ ముబారక్ ,గురుకులాల లాంటి అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ముఖ్యమంత్రి.
రాష్ట్రంలో మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టే తాము టీఆర్ఎస్ తో కలిసి ఉన్నాము అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ అన్నారు. సీఏఏ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ లు దేశాన్ని బలహీనపరుస్తాయి.
ఇవి ముస్లీంలకు,ఎస్సీ,ఎస్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకమని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడమే కాకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. సీఏఏతో యూపీలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్పీఆర్,ఎన్ఆర్సీ నిర్ణయం వలన కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఈ