కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే దేశంలో ఈ ఒక్కరోజే పదహారుకు పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసుల సంఖ్య 214కి చేరుకుంది అని కేంద్ర్త ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 188కి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.
మరో పంతొమ్మిది మందికి రికవరీ అయినట్లు తెలిపింది. వైరస్ బారీన పడి ఐదుగుతు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని పేర్కోంది.