మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి కమల్ నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జి టాండన్ ను రాజ్ భవన్ లో కలవనున్నారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను కమల్ నాథ్ సమర్పించనున్నారు.
అసెంబ్లీలో బపలరీక్షకు ముందే కమల్ నాథ్ తన సీఎం పదవీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ” కేవలం పదిహేను నెలల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను.
సమర్థవంతంగా ప్రజలకు పాలనను అందించాను. బీజేపీ పదిహేను సంవత్సరాల్లో చేయలేనిది నేను కేవలం పదిహేను నెలల్లోనే చేసి చూపించాను అని తెలిపారు. రైతులు తమపై ఎంతో విశ్వాసం ఉంచారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాం. ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.