తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ”జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపేయాలని ఆర్టీసీని ఆదేశిస్తున్నాను.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రతి డిపో దగ్గర ఐదు బస్సులతో పాటు పది మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నాము. మెడికల్ అవసరానికి మాత్రమే వీర్ని వినియోగిస్తామని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో మెట్రో సర్వీసులన్నీ కూడా బంద్ పెడుతున్నాము. కానీ ఐదు మెట్రో రైళ్లను సిద్ధంగా ఉంచాలని సీఎస్ కు సూచిస్తున్నాను అని అన్నారు.