ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు ఆదేశాలను జారీ చేసింది.
మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇలా మూడు కాలేజీలకు మొత్తంగా రూ. 975 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో కేంద్రం వాటా 60 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి.