విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్గా తేలింది. వారిని ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది.
లండన్ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన వ్యక్తి (34), దుబాయ్ నుంచి వచ్చిన మహిళ (50)కు పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
వీరంతా ఈ నెల 14 నుంచి 18 తేదీల మధ్య నగరానికి వచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్-19 పాజిటివ్గా నమోదైన 27 మందిలో ఒకరు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా, మిగిలిన 26 మందిని ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యశాఖ బులెటిన్ ద్వారా వెల్లడించింది.