తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని గెలిపించిన ప్రజలకి అండగా ఉండాల్సిన తరుణమిది..
ఎంపీటీసీల నుండి జెడ్పీచైర్మన్ వరకు,కార్పోరేటర్ నుండి మేయరు వరకు,వార్డు మెంబర్ నుండి మంత్రి వరకు అందరూ తమ నియోజకవర్గాల్లో ఉండాలి. ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహానా కల్పించాలి.లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ సిబ్బందికి సహాకరించాలి.
ప్రజాప్రతినిధులకు చేతులెత్తి దండం పెడుతున్నా మీరంతా కథానాయకులవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు