Home / TELANGANA / పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ ఆసుపత్రి…

పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ ఆసుపత్రి…

 

కరోనా వైరస్ వ్యాప్తి ని నిరోధించడంలో మన ప్రభుత్వం సమర్దవంతంగా పని చేస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి కితాబిచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలు, రాష్ట్రం షట్ డౌన్ చేయాలని సిఎం కేసీయార్ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తి ని అరికడుతున్నామని అన్నారు. ఇప్పటికే మన దగ్గర వైరస్ వ్యాప్తి రెండవ దశలోకి చేరుకుంది. 26 వ తేదీ మద్యాహ్నం వరకి 44 మందికి కోరోనా పాజిటివ్ అని తేలగా ఒక్కరికి పూర్తిగా నయం అయ్యింది. మిగిలిన వారందరూ కొలుకుంటున్నారు ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని మంత్రి తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ లు ఉన్నారు. తాజాగా దేశంలోనే పలు ప్రాంతాలు వీరు పర్యటించారు.వీరిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విదేశాలనుంది వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని మంత్రి ఈ రోజు సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని మంత్రి కోరారు.

కరోనా వైరస్ గురించి తెలిసిన మొదటి రోజు నుండి అన్నీ విధాలా ముందస్తు చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ ఒక వేళ మూడవ దశలోకి చేరుకుంటే తీసుకోవాల్సిన చర్యలు, మన సన్నద్దత్యపై సమీక్షించారు. సర్వేలెన్స్ పెంచడం ద్వారానే దీనిని అరికట్టగలమని ఆ టీమ్స్ ని పెంచాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలో పనిచేసేవారు, ఆశ వర్కర్ల ఎక్కడ పని చేసే వారు అక్కడే ఉండేలా చూడాలని , సెలవులు పూర్తిగా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి బోజన, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు ను ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి డాటా ఉండాలని చెప్పారు.

వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే హాస్పిటల్స్, సిబ్బంది, వైద్య పరికరాలపై చర్చించారు. గాంధీ ఆసుపత్రి ని పూర్తిగా కరోనా చికిత్స కె వినియోగించేలా తయారు చేయాలని చెపారు. ఇప్పటికే గాంధీ లో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మిగతా అన్నీ విభాగలని కూడా తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని ఆదేశించారు. కింగ్ కోటి ఆసుపత్రి కూడా సిద్దంగా ఉంచాలన్నారు . వీటితో పాటు అవసరం అయితే ప్రైవేట్ మెడీకల కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ ల సేవలు వినియోగించుకొనేందుకు కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి ఆద్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలియజేశారు. పేషంట్ల సంఖ్య పెరిగితే ముందుగా అవసరం అయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్.. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని tsmidc ఎండి చంద్ర శేఖర్ రెడ్డి ని ఆదేశించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమన పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించిన మంత్రి, ఐసియూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని సూచించారు. మూడవ దశలోకి వెళ్ళకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వెళ్లకూడదని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అయిన ముందు జాగ్రత్తగా అన్నీ సిద్దం చేసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా షట్ డౌన్ ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. పక్కన వారిని కలవకుండా ఉండడమే మనల్ని రక్షిస్తుంది అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat