తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఇండియా బులిటెన్ తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 41కి చేరాయి.
మధ్యాహ్నం వరకు 39 కేసులు నమోదు అయ్యాయి.అయితే బుధవారం రాత్రికి మరో 2 కేసులు పెరిగి 41కి చేరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసులు నమోదు కాలేదు అనుకున్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులలో ఒకటి సౌదీ నుంచి వచ్చిన 3 ఏండ్ల బాలుడు.
మరొకరు ఒక మహిళ కావడం విశేషం. ఇక దేశంలో ఎక్కువ కరోనా కేసులు మహారాష్ట్ర 122, కేరళలో 118, కర్ణాటకలో 51 కేసలు నమోదు అయ్యాయి. మణిపూర్, పుదుచ్చేరి, మిజోరంలలో ఒక్కొక్క కరోనా కేసు నమోదు అయింది.