దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది.
దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై మూడు లక్షల స్వయం సహాయక బృందాలకు లబ్ధి చేకూరనున్నది.
అదే విధంగా ఉద్యోగులకు డెబ్బై శాతం పీఎఫ్ ను ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం.మూడు నెలల జీతం లేదా డెబ్బై శాతం పీఎఫ్ లో ఏది తక్కువైతే అది తీసుకోవచ్చు కేంద్రం ప్రకటించింది.