తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?.
అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై అధికారులతో ఆయన చర్చించారు