తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే.
దీంతో హైదరాబాద్ నగరంలోని యాచకుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ క్రమంలో కూకట్ పల్లిలో తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు ఆకలితో ఆలమటిస్తున్న యాచకులు ముగ్గురు కన్పించారు.
దీంతో ఆ ముగ్గురికి పోలీసులు ఆహారాన్ని సమకూర్చారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..పోలీసులు చేసిన పనిని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి శబాష్ పోలీస్ అని పొగడ్తల వర్షం కురిపించారు.