కరోనా వైరస్ నియంత్రణ కొసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రభావం వల్ల సికింద్రాబాద్ లో గల సర్వ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న 45 మంది అనాధ విద్యార్థులకు 3రోజుల నుండి సరుకులు అయిపోయి పస్తులు ఉంటున్నారని విషయం TV9 కథనం ద్వారా తెలుసుకొన్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చలించిపోయి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
తక్షణమే ఈ 4 నెలకు సరిపోయే సరుకులు మరియు తాత్కాలిక అవసరాల కోసం 25 వేల రూపాయల చెక్కును ఆ సంస్థ నిర్వాహకుడు CV Reddy గారికి అందించడం జరిగింది.
లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఈ సంస్థకు శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.