గుజరాత్లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్ కావాల్సి వచ్చింది.
సూరత్లోని రాండర్ జోన్లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు.
12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి సంహారకాలతో శుభ్రం (శానిటైజ్) చేయించారు.