తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు శుక్రవారం నాడు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు శుక్రవారం రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు.
మరోవైపు కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై కోలుకున్నారు .అయితే మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు తేలింది.రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఒక కుటుంబంలో కరోనా వచ్చిన వ్యక్తి ఇంట్లో పన్నెండు మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలో భార్య,కుమార్తె,కోడలు కు కరోనా సొకినట్లు తేలింది.దీంతో వీళ్లను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మెదక్ జిల్లా మొత్తంగా నాలుగు కేసులు నమోదైతే ఆ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం.