Home / NATIONAL / దేశంలో 14 కరోనా హాట్ స్పాట్స్

దేశంలో 14 కరోనా హాట్ స్పాట్స్

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ కేసులు పెరుగుతున్నాయన్న దానిపై కేంద్రం దృష్టిపెట్టింది. భారీగా కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో కరోనా నివారణకు మరింత పటిష్టంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 14 కరోనా హాట్ స్పాట్స్‌ను కేంద్రవైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. కరోనా కేసుల సంఖ్య సడెన్‌గా పెరిగిన ప్రాంతాలు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్స్‌గా పేర్కొంటారు. అలా మొత్తం 14 ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కరోనా హాట్ స్పాట్స్ జాబితా:

1. దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ)
2. నిజాముద్దీన్ (ఢిల్లీ)

3. నోయిడా (ఉత్తరప్రదేశ్)

4. భిల్వారా (రాజస్థాన్)

5. కాసర్‌గడ్ (కేరళ)

6. పతనంతిట్ట (కేరళ)

7. కన్నూరు (కేరళ)

8. ముంబై (మహారాష్ట్ర)

9. పుణె (మహారాష్ట్ర)

10. యావత్మల్ (మహారాష్ట్ర)

11. ఇండోర్ (మధ్యప్రదేశ్)

12. జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)

13. అహ్మదాబాద్ (గుజరాత్)

14. లద్దాఖ్ (లద్దాఖ్)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat