Home / NATIONAL / ఒకపూట భోజనం మానెయ్యాలి-బీజేపీ కార్యకర్తలకు ప్రధాని పిలుపు

ఒకపూట భోజనం మానెయ్యాలి-బీజేపీ కార్యకర్తలకు ప్రధాని పిలుపు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న ప్రధాని మోదీ తాజాగా భాజపా కార్యకర్తలకు మరో టాస్క్‌ ఇచ్చారు.

నేడు భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్‌పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక దూరం పాటించాలని సూచించారు. పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని.. వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat